Thursday, July 22, 2010
భగవంతుని పూజకు శ్రేష్టమైన పువ్వులు
పరమేశ్వరుని పూజలకు జిల్లేడూ, గన్నేరూ, మారేడూ, తమ్మి, ఉత్తరెణు ఆకులూ, జమ్మి ఆకులూ, జమ్మి పువ్వులూ, నల్లకలువలు మంచివి.
తొడిమ లేని పువ్వులు పూజకి పనికిరావు. తమ్మి పువ్వుకి పట్టింపులేదు.
మారేడు నందు శ్రీమహాలక్ష్మి, నల్లకలువ నందు పార్వతీ, తెల్ల కలువనందు కుమార స్వామి, కమలము నందు పరమేశ్వరుడూ కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతి దేవి తెల్ల జిల్లెడులో, బ్రహ్మ కొండవాగులో, కరవీరపుష్పంలో గణపతీ, శివమల్లిలో శ్రీమహావిష్ణువూ, సుగంధ పుష్పాలలో గౌరీ దేవి ఉంటారు.
అలాగే శ్రీమహావిష్ణువుని అక్షింతల తోనూ, మహాగణపతిని తులసితోనూ, తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవినీ, మల్లెపూలతో భైరవుడ్నీ, తమ్మి పూలతో మహాలక్ష్మినీ, మొగలి పువ్వులతో శివుడ్నీ, మారేడు దళాలతో సూర్యభగవానుడ్ని ఎట్టి స్ధితిలోనూ పూజింపరాదు.
Subscribe to:
Post Comments (Atom)
జిల్లేడులో మీరు చూపించిన దానికన్నా తెల్లజిల్లేడు మంచిది.
ReplyDelete